తెలంగాణ వచ్చినా భూ సమస్యలు పరిష్కారం కాలె

తెలంగాణ వచ్చినా భూ సమస్యలు పరిష్కారం కాలె

హైదరాబాద్, వెలుగు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, ఇంకా భూ సమస్యలు పరిష్కారం కాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. భూస్వాములకే తిరిగి చట్టబద్ధంగా భూములు అప్పగిస్తున్నారని మండిపడ్డారు.

శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మగ్దూం భవన్‌‌‌‌‌‌‌‌లో జాతీయ జెండాను నారాయణ ఎగరవేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ దళిత బంధు పేరిట ఇస్తున్న రూ.10 లక్షల్లో కేవలం 3, 4 లక్షలు మాత్రమే లబ్ధిదారులకు అందుతున్నాయన్నారు. తెలంగాణ ఇంకా పసి బిడ్డగానే ఉందని, 1,450 మంది అమరవీరుల ప్రాణ త్యాగాలతో రాష్ట్రం వచ్చిందని, స్వాముల చుట్టూ తిరిగితే రాలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీపీఐ నిర్మాణాత్మకమైన పాత్ర పోషించిందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి గుర్తుచేశారు.