గుత్తా సుఖేందర్ రెడ్డి కాన్వాయ్కు ప్రమాదం

గుత్తా సుఖేందర్ రెడ్డి కాన్వాయ్కు ప్రమాదం
  • నల్గొండకు వస్తుండగా కాన్వాయ్లోని కార్లు ఢీ

నల్గొండ: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రమాదం తప్పిపోయింది. హైదరాబాద్ నుండి నల్గొండకు వస్తుండగా రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద కాన్వాయ్ లోని కార్లు  ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో... ఆ కారును అనుసరిస్తూ వస్తున్న మరో నాలుగు కార్లు ఒకదాన్నొకటి గుద్దుకున్నాయి. డ్రైవర్లు సడన్ బ్రేక్ వేయడంతో కార్లు ఢీకొట్టినా ప్రమాదం జరుగలేదు.
మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సురక్షితంగా ఉన్నారు. అయితే కాన్వాయ్ లోని మూడు కార్లు స్వల్పంగా దెబ్బతినడంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాద్ కు తిరిగి వెళ్లిపోయారు.