శేరిలింగంపల్లి భారత్ బంద్ లో ఉద్రిక్తత : వ్యక్తిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే

శేరిలింగంపల్లి భారత్ బంద్ లో ఉద్రిక్తత : వ్యక్తిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే

శేరిలింగంపల్లి భారత్ బంద్ లో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డుపై ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ప్రశ్నించారు సామాన్య వ్యక్తి . ధర్నా కోసం టైం పెట్టారు కదా.. ముందే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. దీంతో ప్రశ్నించిన వ్యక్తిపై చేయిచేసుకున్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. అంతే కాదు… ఎమ్మెల్యే వెంట ఉన్న కార్యకర్తలు.. ప్రశ్నించిన వ్యక్తిని అక్కడి నుంచి తోసివేశారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు జనం. బంద్ వల్ల ఆఫీసులకు వెళ్లాలనుకునేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసలైన రైతులు శాంతియుతంగా బంద్ లో పాల్గొంటుండగా.. పార్టీల నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని సీరియస్ అవుతున్నారు ప్రజలు.