బాలాకోట్‌లో మళ్లీ టెర్రరిస్టు క్యాంపులు.. ఏరేయడానికి రెడీ: ఆర్మీ చీఫ్

బాలాకోట్‌లో మళ్లీ టెర్రరిస్టు క్యాంపులు.. ఏరేయడానికి రెడీ: ఆర్మీ చీఫ్

బాలాకోట్ లో టెర్రరిస్టులు మరో సారి క్యాంప్ లు నిర్వహిస్తున్నారని అన్నారు  ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్.  దాదాపు 500 మంది టెర్రరిస్టులు జమ్మూ కశ్మీర్‌లోకి చొరబడడానికి  చూస్తున్నారని చెప్పారు. ఇది వరకే తాము బాలాకోట్ దాడులను నాశనం చేసినా ఇప్పుడు మళ్లీ క్యాంప్ లు నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశంలోకి చొరబడడానికి వచ్చే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి బలగాలను బార్డర్ కు పంపించామని అన్నారు.

జమ్మూకశ్మీర్ ప్రజల మధ్య సమాచార వ్యవస్థ సరిగానే ఉందని చెప్పారు రావత్. జమ్మూకశ్మీర్ ప్రజలు తమ పనులు తాము చేసుకుంటున్నారని… రాష్ట్రంలో ఎలాంటి స్తంభనా లేదన్నారు. పాకిస్తాన్ కాల్పులను ఎలా డీల్ చేయాలో సైన్యానికి తెలుసన్నారు రావత్. ఇస్లామ్ ను కొన్ని శక్తులు విచ్ఛిన్నం కోసం వాడుకుంటున్నాయన్నారు ఆర్మీ చీఫ్. ఇస్లామ్ అసలు ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు.