రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు…మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి. శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ..బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ కు.. ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు.

రామగుండం అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. బీజేపీకి ఓటేసి గెలిపిస్తే.. కేంద్ర నిధులతో రామగుండాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు వివేక్.