హైదరాబాద్, వెలుగు: వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పలు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(సెట్)లకు కన్వీనర్లను ఉన్నత విద్యా మండలి నియమించింది. ఆయా సెట్ లను నిర్వహించే వర్సిటీల వివరాలనూ వెల్లడించింది. త్వరలోనే అన్ని సెట్ ల తేదీలనూ ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఎంసెట్, పీజీఈసెట్ లను జేఎన్టీయూకు, ఈసెట్, లాసెట్ లను ఉస్మానియాకు, ఐసెట్ను కాకతీయకు, ఎడ్ సెట్ను మహాత్మాగాంధీ వర్సిటీకి, పీఈసెట్ ను శాతవాహన వర్సిటీకి కేటాయించారు.
ఎంసెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ దీన్ కుమార్ను, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్ను ఈసెట్ కన్వీనర్గా, ఓయూ లీగల్ సెల్ డైరెక్టర్ విజయలక్ష్మిని లాసెట్ కన్వీనర్గా నియమించారు. పీజీఈసెట్ కన్వీనర్ గా బి. రవీంద్రరెడ్డి, ఐసెట్ కన్వీనర్ గా పి.వరలక్ష్మీ, పీఈసెట్ కన్వీనర్ గా ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ నియమితులయ్యారు.