చిన్న సినిమాగా వచ్చి ఊహించిన విజయాన్ని అందుకున్న చిత్రం ది కేరళ స్టోరీ. గతేడాది మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. థియేటర్ లో కలెకన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు సీనీ లవర్స్. ఎట్టకేలకు ఈ మూవీ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. 2024 ఫి బ్రవరి 16 నుంచి జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ' మూవీని విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళ రాష్ట్రంలో దాదాపు 32 వేలమంది అమ్మాయిలను బలవంతంగా మతం మార్పించి.. వారిని తీవ్రవాదులుగా ఎలా మార్చారు అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు సుదీప్తో సేన్. విడుదలకు ముందు చాలా వివాదాలు తలెత్తిన సినిమాకు ఏకంగా రూ.200 కోట్లు వచ్చాయి.