పబ్ జి పోటీలు

పబ్ జి పోటీలు

వివాదాల సంగతి ఎలా ఉన్నా, ‘పబ్​జి’ గేమ్​ మాత్రం సక్సెస్​ఫుల్​గా దూసుకెళ్తోంది. అత్యంత ఆదరణ పొందిన ఈ గేమ్ ను మరో లెవెల్​కు తీసుకెళ్లేందుకు తయారీదారులు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వివిధ దేశాల్లో ‘పబ్​జి’ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. తాజాగా మన దేశంలో ‘ద పబ్​జి మొబైల్​ ఇండియా టూర్​ 2019’ను ప్రారంభించారు. పబ్​జి గేమ్​ ఆడే ప్లేయర్స్​ అందరూ దీనిలో పార్టిసిపేట్​ చేయొచ్చు. గేమ్​ ఆడే వాళ్లు తమ స్క్వాడ్​ను ఏర్పాటు చేసుకుని, వేరే స్క్వాడ్స్​తో పాల్గొనాల్సి ఉంటుంది. ఇలా అనేక దశల్లో, నాలుగు నెలలపాటు ఈ టోర్నమెంట్​ సాగుతుంది. ఇతర స్క్వాడ్​లను ఓడించి ఫైనల్​కు​ చేరుకోవచ్చు. అలాగే  జైపూర్, గౌహతి, పుణె, విశాఖపట్నంలలో రీజనల్​ ఫైనల్స్​ నిర్వహిస్తారు. వీటిలో గెలిచిన వాళ్లను ఫైనల్​కు ఎంపిక చేస్తారు. అక్టోబర్​లో కోల్​కతాలో ఫైనల్​ జరుగుతుంది. నాలుగునెలలపాటు జరిగే ఈ ఆన్​లైన్​ టోర్నమెంట్​లో విజేతకు 1.5 కోట్ల రూపాయల  ప్రైజ్​ మనీ అందించనున్నారు.