అధికార పార్టీ నేతలే కోవిడ్ రూల్స్ పాటించడం లేదు

అధికార పార్టీ నేతలే కోవిడ్ రూల్స్ పాటించడం లేదు

రాష్ట్రంలో ఒమిక్రాన్, కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్నా అధికార పార్టీ నేతలే కోవిడ్ రూల్స్ పాటించడం లేదు. రైతు బంధు సంబరాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే బాల్క సుమన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన మాస్క్ పెట్టుకోకుండా ప్రోగ్రామ్స్ కు అటెండ్ అవుతున్నాడు. సుమన్ తో పాటు ఉన్న నేతలు కూడా మాస్కులు పెట్టుకోబడం లేదు. ఇవాళ చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి మందమర్రి మండలం క్యాతనపల్లి మీదుగా గద్దెరాగడిలోని అమ్మగార్డెన్ వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేశారు. దాదాపు 40 కిలోమీటర్ల మేర దాదాపు రెండు వందల వరకు పైగా ట్రాక్టర్లతో వెయ్యి మందికి పైగా ర్యాలీలో పాల్గొన్నారు. సామాన్యులు కరోనా రూల్స్ పాటించకుంటే జరిమానాలు విధిస్తున్న పోలీసులు.. అధికార పార్టీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.