లక్నో: ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు 17 లోక్ సభ సీట్లను ఆఫర్ చేసినట్లు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్కు కాంగ్రెస్ ఒప్పుకుం టేనే రాయ్బరేలీలో రాహుల్ గాంధీ న్యాయ్ యాత్రలో అఖిలేశ్ యాదవ్ పాల్గొంటారని పేర్కొంది. ‘మేము కాంగ్రెస్ కు 17 లోక్సభ సీట్లు ఆఫర్ చేశాం. కాంగ్రె స్ పార్టీ స్పందనను బట్టి రాయ్ బరేలీలో మంగళవారం జరగనున్న సభలో పాల్గొన డమా, మానడమా అనే దానిపై అఖిలేశ్ నిర్ణయం తీసుకుంటారు’ అని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి మీడియాకు తెలిపారు. అయితే కాంగ్రెస్కు ఆఫర్ చేసిన నియోజకవర్గాలను వెల్లడిం చేందుకు నిరాకరించారు. రాహుల్ యాత్ర సోమవారం అమేథీ మీదుగా సాగింది. మంగళవారం రాయ్బరేలీలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ యాత్రలో పాల్గొం టానని అఖిలేశ్ యాదవ్ గతంలో ప్రకటిం చారు. ఎస్పీ, కాంగ్రెస్ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఎస్పీ గతంలో కాంగ్రెస్ పార్టీకి 11 ఎంపీ సీట్లను ఆఫర్ చేయగా.. ఎక్కువ కేటాయించాలని యూపీ పీసీసీ డిమాండ్ చేసింది. 2009 ఎన్నికల్లో గెలిచిన 24 స్థానాలను కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుచుకుంటుందని యూపీ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ ఇదివరకు ప్రకటించారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని రాయబరేలీ ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.