శిల్పారామంలో సమ్మర్ ఫెస్టివల్ క్యాంప్ షురూ

శిల్పారామంలో సమ్మర్ ఫెస్టివల్ క్యాంప్ షురూ

శిల్పారామంలో సమ్మర్ ఫెస్టివల్ క్యాంప్ సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు కొనసాగునున్న ఈ క్యాంప్​లో మట్టి కుండల తయారీ, మట్టి బొమ్మలు, మధుబని, నిర్మల్, ఆక్రాలిక్, ట్రైబల్ పెయింటింగ్, సంస్కృతం, భగవద్గీత శ్లోకాలను ఉచితంగా నేర్పిస్తారు. చిన్నారులతో పాటు పెద్దవాళ్లు సైతం ఈ క్యాంప్​కు వచ్చి నేర్చుకోవచ్చని, ఆస్తకి ఉన్న వారు శిల్పారామం ఆఫీసులో సంప్రదించాలని అధికారులు తెలిపారు. 
‌‌‌‌- వెలుగు,మాదాపూర్​