టీఆర్ఎస్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

టీఆర్ఎస్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

కారు గుర్తును పోలిన సింబల్స్ తొలగించాలన్న టీఆర్ఎస్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కారు  గుర్తును పోలిన రోడ్ రోలర్, రోటీ మేకర్ సహా 8 సింబల్స్  తొలగించాలని టీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. 

కోర్టు విచారణకు హాజరైన ఈసీ అధికారులు మునుగోడు బైపోల్ కోసం స్వతంత్ర అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించామని హైకోర్టుకు విన్నవించారు. ఈ సమయంలో గుర్తులు మార్చలేమని చెప్పారు. ఈసీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.