రామప్ప ఆలయానికి సింగరేణి మైనింగ్‌తో ముప్పు అవాస్తవం

రామప్ప ఆలయానికి సింగరేణి మైనింగ్‌తో ముప్పు అవాస్తవం

హైదరాబాద్: రామప్ప ఆలయానికి సింగరేణి మైనింగ్‌తో ముప్పు అవాస్తవమని సింగ‌రేణి యాజ‌మాన్యం తెలిపింది. ప్రతిపాదన దశలోనే వెంకటాపురం ఉప‌రిత‌ల గ‌ని ఉందని, సమగ్ర శాస్త్రీయ అధ్యయనం తర్వాతే ముందుకుక వెళ్తామని సింగ‌రేణి యాజ‌మాన్యం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ సమ్మతి తర్వాతే తదుపరి కార్యాచరణ ఉంటుందని సింగ‌రేణి యాజ‌మాన్యం వెల్లడించింది. రామ‌ప్ప పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని సింగ‌రేణి యాజ‌మాన్యం స్పష్టం చేసింది.