గడ్డం వంశీకృష్ణకు సీపీఐ మద్దతిస్తుంది : చాడ వెంకటరెడ్డి

గడ్డం వంశీకృష్ణకు సీపీఐ మద్దతిస్తుంది :  చాడ వెంకటరెడ్డి

పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని ఆ పార్టీ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లిలో ఇవాళ విలేకరుల సమావే శంలో ఎమ్మెల్యే విజయరమణారావు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలతో కలిసి మాట్లాడారు. కాకా వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి ప్రజలకు 40 ఏండ్లుగా సేవలు అందిస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రజాస్వామ్య న్నీఖూనీ చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు మోడీ యత్నిస్తున్నాడన్నారు. 

కేసీఆర్ పాలనలో నియంతృత్వం కొనసాగిందన్నారు  చాడ వెంకటరెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉండి ఏమి చేయలేదన్నారు. వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడన్నారు. ఈశ్వర్ చేసిందేమీ లేదు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడు తూ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంతానికి చేసిందేమి లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకరికొకరు సహకరించుకుంటున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా సీపీఐ దాని అనుబంధ సంఘాలు వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

కాంగ్రెస్ పార్టీకి సీపీఐతో అనుబంధం

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సీపీఐతో మంచి అనుబంధం ఉందన్నారు. కాక వెంకటస్వామిని పెద్దపల్లి నుంచి నాలుగు సార్లు, తనను ఒక్కసారి ఎంపీగా గెలి పించడంలో సీపీఐ మద్దతు ఎంతో ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలుస్తుందన్నారు. తెలంగాణను నాశనం చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసన్నారు. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన యువకులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించామన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.