- సీఎస్ను కోరిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గంలో ప్రతిపాదిత 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజును ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కోరారు. గురువారం హైదరాబాద్లో సీఎస్ను కలిసి మాట్లాడారు. రామగుండంలో మూసివేసిన 62.5 మెగావాట్ల పవర్ ప్లాంట్స్థానంలో 800 మెగావాట్ల పవర్ప్లాంట్ నిర్మాణం త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు, రైల్వే స్టేషన్లలో ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. ఇందుకు సీఎస్ సానుకూలంగా స్పందించారని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ తెలిపారు.
