సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్

హైదరాబాద్లో వివిధ ప్రాంతాలనుంచి  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏసీ బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే.పుష్పక్ పేరుతో ప్రతి 15 నిమిషాలకు ఒక ఏసీ బస్సును ఎయిర్ పోర్టుకు నడుపుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ అనేక ప్రదేశాల్లో ప్రయాణికులను ఎయిర్ పోర్టు కు చేర్చుతున్నాయి. అయితే ఈ బస్సులను నడిపే రూట్లలో స్వల్ప మార్పులు చేసింది టీఎస్ ఆర్టీసీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్ పోర్టు వెళ్లే మార్గంలో స్వల్ప మార్పులు చేసింది. మెహదీపట్నం నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్  మార్గంలో ఎయిర్ పోర్టుకు వెళ్లే బస్సులను ఫ్లైవర్ కింద రోడ్డుపై నుంచి మళ్లించింది. శుక్రవారం (ఏప్రిల్ 26) నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయని మెహదీ పట్నం డిపోకు చెందిన ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. 

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కు నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ నడుపోతోంది. 49 పుష్పక్ ఏసీ బస్సులను నాలుగు రూట్లలో 24 గంటలు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా నడుపుతోంది.ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికోసం నెలవారి బస్ పాసులను కూడా అందిస్తోంది. మియాపూర్ ఎక్స్ రోడ్, జేబీఎస్, సికింద్రాబాద్ నుంచి పుష్పక్ ఏసీ బస్సులను నడుపుతున్నారు. మియాపూర్ నుంచి కేవలం 90 నిమిషాల్లోనే చేరుకుందని అధికారులు చెబుతున్నారు.