మియాపూర్‌‎లో విషాదం.. ఫోన్ మాట్లాడుతుండగా ఐదో అంతస్తు నుంచి పడి యువతి మృతి

మియాపూర్‌‎లో విషాదం.. ఫోన్ మాట్లాడుతుండగా ఐదో అంతస్తు నుంచి పడి యువతి మృతి

హైదరాబాద్: మియాపూర్‎లోని మయూరి నగర్‎లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. అపార్ట్‎మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందపడి యువతి మృతి చెందింది. అపార్ట్‎మెంట్ బాల్కనీపై కూర్చుని ఫోన్ మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు జారి పడినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది యువతి.

మృతురాలిని ప్రణవి (20)గా గుర్తించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతి ప్రమాదవశాత్తూ జారి పడిందా..? లేక మరేదేమైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.