బైకర్‌ను అడ్డగించి గొంతుకోసి చంపిన దుండగులు

బైకర్‌ను అడ్డగించి గొంతుకోసి చంపిన దుండగులు

ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని పట్టపగలు గొంతు కోసి హత్య చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది. ఫలక్‌నుమా బస్ డిపో సమీపంలోని ఓ వీధిలోంచి వెళ్తున్న వాహనదారుడిని గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి కత్తితో గొంతు కోశారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడు పైకి లేచి దాదాపు 100 మీటర్ల మేర పరిగెత్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు పూర్తిగా తెలియరాలేదు. మృతుడికి సంబంధించిన వాళ్ళు వస్తేనే వివరాలు తెలిసే అవకాశముంది. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీని కలెక్ట్ చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.