టీఆర్ఎస్ వాళ్లకే దళిత బంధు ఇచ్చుకుంటున్నారు

టీఆర్ఎస్ వాళ్లకే దళిత బంధు ఇచ్చుకుంటున్నారు

ఇల్లందు: దళిత బంధు లబ్ధదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని వరంగల్ జిల్లా ఇల్లందులో దళితులు నిరసనకు దిగారు. దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు దళిత బంధు ఇచ్చుకుంటున్నారని ఆరోపిస్తూ వరంగల్ - ఖమ్మం రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అర్హులను పక్కన బెట్టి 50మంది అనర్హులను ఈ స్కీమ్ కు ఎంపిక చేసినట్లు తెలిపారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ వాళ్లను, కుటుంబ సభ్యులను ఎంపిక చేయడం పట్ల స్థానిక దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

ఇవి కూడా చదవండి:

గవర్నర్‌ను కలిసిన భగవంత్ మాన్

ఖైదీలకు సుశీల్ కుమార్ రెజ్లింగ్ పాఠాలు