హరీష్ రావుకి ట్రబుల్ మొదలైంది

హరీష్ రావుకి ట్రబుల్ మొదలైంది

ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావుకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ట్రబుల్ మొదలైందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. తన భార్యను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పెట్టడంతోనే.. స్థానిక సంస్థల నేతలను సొంత బిడ్డల్లా చూసుకున్నారని చెప్పారు. నైతికంగా ఉమ్మడి మెదక్ జిలాల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అన్నారు. అధికార పార్టీకి 700కు పైగా ఓట్లు ఉండి కూడా క్యాంప్ లు పెట్టారని.. కాంగ్రెస్ అలా చేయలేదన్నారు. ఉమ్మడి మెదక్ జిలాల్లో  230తో పాటు తమకు మరో 170 ఓట్లు వస్తాయని ఆశిస్తున్నామన్నారు జగ్గారెడ్డి.