కేసీఆర్ దళితబంధు సభకు కుటుంబమంతా హాజరుకావాలి

 కేసీఆర్ దళితబంధు సభకు కుటుంబమంతా హాజరుకావాలి
  • మానకొండూరు దళితబంధు సన్నాహక సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: కేసీఆర్ నిర్వహించే దళితబంధు సభకు కుటుంబమంతా హాజరుకావాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మానకొండూరులో గురువారం నిర్వహించిన దళితబంధు సన్నాహక సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ఆసరా ఫించన్, రైతుబంధ, కాళేశ్వరం జలాలు, 24గంటల కరెంటు మాదిరి దళితబంధు సైతం సూపర్ సక్సెస్ ప్రోగ్రాం అవుతుందన్నారు. మద్దతు దరతో సంపూర్ణంగా ధాన్యం సేకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పుట్టిన నేలపై పుట్టడం అదృష్టం అన్నారు. అభివృద్ది సంక్షేమ పథకాలతో యావత్ దేశంపై ఒత్తిడి పడిందని, కేసీఆర్ లాంటి సీఎం కావాలని అన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయని ఆయన వివరించారు. కేసీఆర్ ధళితబంధు సభకు కుటుంబం మొత్తం హాజరవ్వాలని కోరారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ప్రతీ ఒక్కరూ నిలవాలని మంత్రి గంగుల సూచించారు.