
బీఆర్ఎస్ నేతల పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. గత ప్రభుత్వం చేతగానితనంతో RRR పని ఆగిపోయిందన్నారు. ఢిల్లీ పర్యటనలో చాలా అభివృద్ధి పనులకు.. నిధులు మంజూరు చేయించుకున్నామని చెప్పారు. రూ.700 కోట్లతో నల్గొండ బైపాస్ రోడ్డును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంజూరు చేశారని చెప్పారు. ఇందుకు ఆయనకు దన్యావాదాలని అన్నారు.
వారంలో భూమి సేకరించి టెండర్లు పిలుస్తామని చెప్పారని వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్పై కిషన్రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ను టచ్ చేస్తే నామరూపాలు లేకుండా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.