అమ్మవారికి 108 బోనాలు సమర్పించిన జీహెచ్ఎంసీ కార్మికులు 

 అమ్మవారికి 108 బోనాలు సమర్పించిన జీహెచ్ఎంసీ కార్మికులు 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయ్స్ యూనియన్ ,బీజేపీ మజ్దూర్ సెల్ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఆఫీసులో కార్మికులు అమ్మవారికి 108 బోనాలు సమర్పించారు. జీహెచ్ఎంసీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..అమ్మవారి దయ వారిపై ఉండాలని బీజేపీ మాజ్దూర్ సెల్ సిటీ చైర్మన్ గోపాల్ తెలిపారు. ఏపీలో కార్మికుల జీతాలు పెంచారని..ఇక్కడ కూడా జీహెచ్ఎంసీ కార్మికుల జీతాలు 21 వేలకు పెరగాలని అమ్మవారికి కార్మికులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారన్నారు. తెల్లవారుజాము నుంచే కార్మికులు రోడ్లను క్లీన్ చేస్తుంటారని.. వారు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి పూజలు చేశామన్నారు.