పరీక్షలు లేకుండానే విద్యార్థులు ప్రమోట్

పరీక్షలు లేకుండానే విద్యార్థులు ప్రమోట్

కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు. ఇప్పటికే పరీక్షలు నిర్వహించాల్సిన సమయం కూడా దాటిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పదో తరగతి పరీక్షలపై లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.