బెల్లంపల్లిలో పదేండ్లుగా రూపాయి అభివృద్ది జరగలేదు : గడ్డం వినోద్

బెల్లంపల్లిలో పదేండ్లుగా రూపాయి అభివృద్ది జరగలేదు : గడ్డం వినోద్

బెల్లంపల్లి నియోజకవర్గంలో పదేండ్లుగా అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ అన్నారు. బెల్లంపల్లిలో రూపాయి డెవలప్మెంట్ కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో గడ్డం వినోద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏండ్ల నుంచి బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్క రిప్రజెంట్ లేడని ఇప్పుడు తాను వచ్చానని తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. 

గోదావరి నీళ్లు తెస్తానని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పైప్ లైన్ వేశారని చెప్పారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వేరే దగ్గర నుంచి నీళ్లు ఇస్తామని ఇవ్వలేదని అన్నారు.  అదిలాబాద్ జిల్లా పూర్తిగా వెనకపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంల్లి ఆస్పత్రిలో స్టాఫ్ 20 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఇలా తమ సమస్యలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయని సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని వినోద్ కుమార్ అన్నారు.