
హైదరాబాద్, వెలుగు : యూపీకి చెందిన అన్వర్ అలీ(19), బాబుల్ రెడ్డినగర్ లో ఉంటున్నాడు. లాక్డౌన్తో పనులు లేక దొంగగా మారాడు. మంగళవారం మైలర్ దేవ్ పల్లి డివిజన్ బృందావన్ కాలనీకి చెందిన సురేందర్ను గన్తో బెదిరించి పర్సు, రెం డు ఏటీఎం కార్డులను లాక్కొని పారిపోతున్నాడు. బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించగా ఐపీసీ సెక్షన్25(1) కింద కేసు బుక్ చేశామని మైలార్దేవ్పల్లి సీఐ నర్సింహ తెలిపారు.