హింసకు పాల్పడితే పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ రద్దు.. నిరసనకారులకు ఢిల్లీ పోలీసుల వార్నింగ్

హింసకు పాల్పడితే పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ రద్దు.. నిరసనకారులకు ఢిల్లీ పోలీసుల వార్నింగ్

న్యూఢిల్లీ: కాక్రోచ్​జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరుగుతున్న నిరసనలో ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు తేలితే వారి పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులు రద్దయ్యే చాన్స్​ ఉందని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. 

నిరసనలో అల్లర్లు, ఇతర హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, టెక్నికల్ ఆధారాల ద్వారా గుర్తిస్తున్నామన్నాయి. ఎవరైనా హింసలో పాల్గొంటే చట్ట ప్రకారం వారి పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులను రద్దు చేయవచ్చని వెల్లడించాయి.