హైకోర్టుకు కొత్తగా ముగ్గురు జడ్జిలు

హైకోర్టుకు కొత్తగా ముగ్గురు జడ్జిలు

    
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు జడ్జిలు రానున్నారు. ఇందులో ఇద్దరు అడ్వకేట్లు లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్ కుమార్ జూకంటి, జ్యుడీషియల్ ఆఫీసర్ సుజన కళాసికం ఉన్నారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కౌశల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన కొలీజియం బుధవారం నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

 గతేడాది అక్టోబర్​లో జ్యుడీషియల్ ఆఫీసర్ సుజన కళాసికం, డిసెంబర్​లో అడ్వకేట్లు లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్ కుమార్ జూకంటి పేర్లను తెలంగాణ హైకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. ఈ ముగ్గురి పేర్లకు గవర్నర్, సీఎం ఆమోదముద్ర వేశారు. దీంతో సుప్రీంకోర్టు కొలీజియం కూడా ఈ ముగ్గురి పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సులకు కేంద్రం అంగీకారం తెలిపి, ఆపై రాష్ట్రపతి ఆమోదం పొందితే.. ఈ ముగ్గురు తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా నియమితులు కానున్నారు.