టైగర్​ ట్రయంఫ్​ యుద్ధ విన్యాసాలు

టైగర్​ ట్రయంఫ్​ యుద్ధ విన్యాసాలు

భారత్​, అమెరికాల మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం చేయడం కోసం రెండు దేశాల మధ్య నిర్వహించే టైగర్​ ట్రయంఫ్​ యుద్ధ విన్యాసాలకు ఈ ఏడాది విశాఖపట్టణం వేదికగా నిలిచింది. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్టణంలో టైగర్ ట్రయంఫ్​–2024 విన్యాసాలు మార్చి 28 నుంచి 31 వరకు రెండు విడతల్లో జరిగాయి. ఈ ట్రయంఫ్​ యుద్ధ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొన్నాయి. ఈ మేరకు అమెరికాకు చెందిన యూఎస్​ఎస్​ సోమర్​ సెట్​ యుద్ధ నౌకతోపాటు ల్యాండింగ్​ ఎయిర్​క్రాఫ్ట్​లు, హెలికాప్టర్లు, యూఎస్​ మెరైన్​ కార్ఫ్స్​

ఎమ్మర్కెడ్ దళాలతోపాటు భారత్​ తరఫున ఐఎన్​ఎస్​ జలస్వ, ఐరావత్​ యుద్ధ నౌకలు, ర్యాపిడ్​ యాక్షన్​ మెడికల్​ టీమ్​ కూడా పాల్గొన్నది. మార్చి 25 వరకు హార్బర్​ ఫేజ్​ విన్యాసాలు జరిగాయి. ఇందులో రెండు దేశాల త్రివిధ దళాల శిక్షణ సందర్శనలు, క్రీడా పోటీలు, వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. మార్చి 26 నుంచి 31 వరకు సీ ఫేజ్​ విన్యాసాలు జరిగాయి. ఇందులో హ్యుమానిటేరియన్​ అసిస్టెన్స్​ అండ్​ డిజాస్టర్​ రిలీఫ్​ (హార్డ్​), యుద్ధ విన్యాసాలను విశాఖ సముద్ర తీరానికి 40 మైళ్ల దూరంలో నిర్వహించారు.