కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశీ తిలక్.. ప్రకటించిన హైకమాండ్

కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశీ తిలక్.. ప్రకటించిన హైకమాండ్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.  డా. టీఎన్ వంశీ తిలక్ పేరును ప్రకటించింది పార్టీ హైకమాండ్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ నారాయణన్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి కోసం బీజేపీ అధిష్టానంతో చర్చించి వంశీ తిలక్ పేరును ఫైనల్ చేసింది. 

2023లో జరిగిన సాధరణ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత పోటీ చేసి గెలుపొందారు. ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కి బై ఎలక్షన్ అనివార్యం అయ్యింది.  ఈ ఎన్నికల్లో లాస్య నందిత అక్కను నిలబెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కాగా, అటు కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్  పోటీ చేయనున్నారు.