యాదాద్రిలో అటెండర్ను కొట్టిన ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలి : టీఎన్జీవో లీడర్లు

 యాదాద్రిలో అటెండర్ను కొట్టిన ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలి : టీఎన్జీవో లీడర్లు

యాదాద్రి, వెలుగు : అటెండర్​ను కొట్టిన ఆఫీసర్​పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ హనుమంతరావుకు టీఎన్​జీవో లీడర్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.  బాధితుడు ఎం.కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల 2న కలెక్టరేట్​కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​ రెడ్డి వచ్చిన సమయంలో లిఫ్ట్​లోకి ఎవరూ వెళ్లకుండా చూడాలని ఏవో జగన్.. కృష్ణకు సూచించారు.

దీంతో  లిఫ్ట్​ వద్దకు వచ్చిన ఏఎస్​డబ్ల్యూవో తారాబాయిని అతడు ఆపారు. నన్నే ఆపుతావా అంటూ తారాబాయి, ఔట్ సోర్సింగ్​ ఉద్యోగి రాహుల్​తో కలిసి అసభ్యంగా దూషిస్తూ ఆయన చొక్కా పట్టుకొని లోనికి తీసుకెళ్లి పలువురు సిబ్బంది చూస్తుండగానే కృష్ణను కొట్టారు. ఈ విషయంపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. తనను ఆకారణంగా కొట్టిన ఏఎస్​డబ్ల్యూవో తారాబాయి, సహకరించిన రాహుల్​పై చర్యలు తీసుకోవాలని బాధితుడు కృష్ణ కలెక్టర్ ​ను కోరాడు.  

ప్రజవాణి దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి..

సూర్యాపేట, వెలుగు : ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్​లో ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ రాంబాబుతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 64 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

సమస్యలను సకాలంలో పరిష్కరించాలి..

నల్గొండ అర్బన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో ప్రజల నుంచి ఫిర్యాదులను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తో కలిసి ఆమె స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 68 దరఖాస్తులు  వచ్చాయని తెలిపారు.