రాష్ట్రంలో ఈ రోజు భారీగా నమోదైన కరోనా కేసులు

రాష్ట్రంలో ఈ రోజు భారీగా నమోదైన కరోనా కేసులు

హైద‌రాబాద్: రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. శుక్ర‌వారం రికార్డు స్థాయిలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ‌‌గ‌డిచిన 24 గంట‌ల్లో 499 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ తెలిపింది. GHMC పరిధిలో కొత్తగా 329 కరోనా కేసులు నమోదుకాగా.. ఒక్క రంగారెడ్డి జిల్లాలో 129  కేసులు న‌మోదైన‌ట్లు తెలిపింది. GHMC పరిధిలో మొత్తం పాజిటివ్‌ కేసులు 4526కు చేరాయ‌ని తెలిపింది ఆరోగ్య‌శాఖ. 

వైర‌స్ తో శుక్ర‌వారం ముగ్గురు చ‌నిపోయార‌ని .. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 198 మంది క‌రోనాతో మ‌ర‌ణించార‌ని వెల్ల‌డించింది. తాజా కేసుల‌తో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 6,526కి చేరగా.. 2,976 మంది క‌రోనా బాధితులు ట్రీట్ మెంట్ తీసుకుంటున్న‌ట్లు తెలిపింది. ఇవాళ 51 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో కోలుకున్న‌వారి సంఖ్య 3,352కు పెరిగింద‌ని తెలిపింది రాష్ట్ర ఆరోగ్య‌శాఖ‌.

orona cases district wise in telangana