
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ద కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్య ఆరోగ్యశాఖ. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 2,282కి చేరగా..ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని1,527 డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. ఈ వైరస్ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మంది మరణించగా.. యాక్టివ్ కేసులు 705 ఉన్నాయని తెలిపింది వైద్య ఆరోగ్యశాఖ.
కొత్తగా నమోదైన 52 కేసుల వివరాలు
చిత్తూరు జిల్లా- 15
కృష్ణా జిల్లా- 15
నెల్లూరు – 07
తూ.గో – 05
కర్నూలు – 04
కడప -02
ప.గో -02
విజయనగరం-01
వైజాగ్ -01