
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకి భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. శనివారం కూడా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. మహమ్మారితో ఐదుగురు చనిపోయారని తెలిపింది రాష్ట్ర ఆరోగ్యశాఖ.
తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,072కి చేరగా..203 మంది వైరస్ తో చనిపోయారని వెల్లడించింది. వ్యాధి నుంచి కోలుకుని ఇవాళ 154 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం రాష్ట్రంలో 3,506 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం 3,363 యాక్టీవ్ కేసులుండగా.. శనివారం 3,188 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది ఆరోగ్యశాఖ.