హైదరాబాద్‌లో ఇవాల్టి నుంచి సెకండ్ డోస్

హైదరాబాద్‌లో ఇవాల్టి నుంచి సెకండ్ డోస్

హైదరాబాద్​, వెలుగు:  సిటీలో నేటి నుంచి సెకండ్  డో స్  వ్యాక్సినేషన్ డ్రైవ్ ని నిర్వహించనున్నట్లు బల్దియా అధికారులు తెలిపారు. గ్రేటర్ లోని  4,846 కాలనీల్లో  డ్రైవ్​చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కాలనీలతో పాటు  పీహెచ్​సీలు, బస్తీ దవాఖానల్లో కూడా వ్యాక్సిన్​ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాలనీలో ఒక రోజు ముందుగా ఇంటింటికి వెళ్లి  గుర్తించిన వారికి మరుసటి రోజు వాక్సిన్ అందిస్తామన్నారు.  వ్యాక్సినేషన్​ కంప్లీట్​ అయిన ఇంటికి స్టిక్కర్ ​వేస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.