అమ్ముడుపొయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి

అమ్ముడుపొయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి

కాంగ్రెస్ పార్టీలో గెలిచి అమ్ముడుపొయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అలా కొట్టడంలో తాను ముందుంటానని ఆయన అన్నారు. మణికొండలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ను రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే.. అధికార పార్టీకి అమ్ముడుపోయే సన్నాసులకు సిగ్గుండాలి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై  చర్యలు తీసుకోకుంటే.. స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కేసీఆర్ పశువులను కొన్నట్లుగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు పదవికి రాజీనామ చేసి.. దమ్ముంటే ఎన్నికలకు రావాలి. తెలంగాణ ఇచ్చింది సొనియా గాంధీ. కాబట్టి ఆమెపై మరియు కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కి ప్రజలు మంచి గుణపాఠం చెబుతారు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.