హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర సాధ్యాసాధ్యాలు పరిశీలించాకే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేశామని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. తాము టీఆర్ఎస్ తరహాలో దళిత ముఖ్యమంత్రి అని, మూడెకరాల భూమి అని దళితులను మోసం చేసే రకం కాదు అన్నారు. డిక్లరేషన్లో ప్రకటించిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. కర్ణాటకలో కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు.
రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి, తెలంగాణలో కూడా ప్రతి హామీని నెరవేరుస్తామని మల్లు రవి ప్రకటించారు. కాంగ్రెస్ చేసిన డిక్లరేషన్పై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మల్లు రవి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ డిక్లరేషన్ను బీఆర్ఎస్ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కారణం చెప్పాలని డిమాండ్ చేశారు.