రేపే బోనాలు .. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

రేపే బోనాలు .. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు గోల్కొండ కోటలో జరిగే బోనాలకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రామ్ దేవ్ గూడ, మక్కాయి దర్వాజా, లంగర్ హౌస్, సెవెన్ టూంబ్స్ ప్రాంతాల నుంచి కోటకు వచ్చే వారు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలన్నారు. బోనాల జాతరకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించామని చెప్పారు.