హైదరాబాద్ బాలానగర్ లో విషాదం.. సహజ ప్రసవమైన కాసేపటికే తల్లి, బిడ్డ మృతి..

హైదరాబాద్ బాలానగర్ లో విషాదం.. సహజ ప్రసవమైన కాసేపటికే తల్లి, బిడ్డ మృతి..

హైదరాబాద్ లోని బాలానగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది..  సహజ ప్రసవమైన కాసేపటికే.. బాలింత, పసి బిడ్డ చనిపోయిన ఘటన బాలానగర్ లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చోటు చేసుకుంది.. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... మృతురాలు అరుణ, సంగారెడ్డికి చెందిన ఆమె పసిబిడ్డ గర్భిణి పిట్లం అరుణ(23), కొద్దిరోజుల కింద డెలివరీ కోసం కేపీహెచ్బీ కాలనీ నాలుగో ఫేజ్ లో ఉండే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అప్పటి నుంచి అరుణ స్థానిక పీహెచ్ సీలో చికిత్స చేయించుకుంటోంది. 

శుక్రవారం ( మే 30 ) రాత్రి ఏడు గంటలకు ఆమెకు పురిటి నొప్పులు రావడంతో తల్లి బాలానగర్ పీహెచ్ సీలో చేర్పించగా.. నార్మల్ డెలివరీ అయి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిసేప టి తర్వాత అరుణకు పల్స్ రేటు పడిపోయి అపస్మారక స్థితికి చేరింది. వెంటనే వైద్య సిబ్బంది అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. బాలుడిని నీలోఫర్ ఆస్పత్రిలో చేర్చించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. బాలింత, పసిబిడ్డ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.