GHMC ఎన్నికల ప్రచారం : డబ్బులు పంపిణీ చేస్తూ దొరికిన టీఆర్ఎసోళ్లు

GHMC ఎన్నికల ప్రచారం : డబ్బులు పంపిణీ చేస్తూ దొరికిన టీఆర్ఎసోళ్లు

జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో ధన ప్రవాహం ఆగడంలేదు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా డబ్బులతో ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా పట్టుకోవడం కలకలం రేపుతుంది.

జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో జగద్గిరి గుట్ట డివిజన్ లో వరంగల్ నుంచి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. డబ్బుల పంపిణీపై సమాచారం అందుకున్న డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.., టీఆర్ఎస్ కార్యకర్తల్ని పట్టుకున్నారు. అనంతరం వారివద్ద ఉన్న నగదుతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.