టీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండా​

టీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండా​

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలే తమ ప్రధాన ఎజెండా అన్నారు పీసీసీ ప్రెసిడెంట్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా బుధవారం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నార్సింగి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్..దుబ్బాక నియోజకవర్గంలో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి పనులు తప్ప గడచిన ఆరేళ్లలో టీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమి లేదన్నారు. కేసీఆర్​ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరచ్చలేదన్నారు. ఈ విషయంపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. అభివృద్ధి పట్టించుకోని, తమ సమస్యలు తీర్చని టీఆర్​ఎస్​ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్​ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం వైఫల్యాలు, అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలు ప్రజలకు వివరించి కాంగ్రెస్​ పార్టీ క్యాండిడేట్​కు మద్దతు కూడగట్టాలని, ఎన్నికల్లో గెలుపుకోసం చిత్తశుద్దితో కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి  షబ్బీర్​ అలీ తో పాటు ​ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.