రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తాజాగా కొత్త షెడ్యూల్ను దుబాయ్లో స్టార్ట్ చేశారు. ఈ కీలక షెడ్యూల్లో రవితేజతో పాటు మిగిలిన నటీనటులంతా జాయిన్ అయ్యారు. ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్లైన్తో రూపొందుతోన్న ఈ చిత్రంలో రవితేజ పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు.
జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తుండగా, భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తోంది. పనోరమా స్టూడియోస్, టి సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూడో చిత్రమిది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.