నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్య నటీనటులతో ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు. వియత్నమీస్ ఫైటర్స్తో సహా 700 మంది ఆర్టిస్టులపై 12 రోజుల పాటు చిత్రీకరించనున్న ఈ ఎపిసోడ్లో నిఖిల్ అద్భుతమైన స్టంట్స్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు.
రెండు మ్యాసివ్ సెట్లలో ప్రతిష్టాత్మకంగా వార్ సీక్వెన్స్ను షూట్ చేస్తున్నామన్నారు. ఈ ఒక్క ఎపిసోడ్కి రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్గా నిలుస్తుందన్నారు. ఈ సీన్ బిగ్ స్క్రీన్పై గొప్ప అనుభూతిని కలిగిస్తుందన్నారు. నిఖిల్ కెరీర్లో ఇది 20వ చిత్రం. ఇందులో తను వారియర్ గెటప్లో కనిపించనున్నాడు.