కిషన్ రెడ్డి ప్రచారాన్నిఅడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం

కిషన్ రెడ్డి ప్రచారాన్నిఅడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. కిషన్ రెడ్డి ప్రచారానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పాటు తోసుకున్నారు. ఘర్షణలో ఓ TRS కార్యకర్త రెచ్చిపోయి SI కాలర్ పట్టుకున్నాడు. టీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తాము అనుమతి తీసుకొని ప్రచారం చేసుకుంటూ ఉంటే కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సీఐ, ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రిగా తాను వస్తే రక్షణ కల్పించే తీరు ఇదేనా అని మండిపడ్డారు కిషన్ రెడ్డి.