
హైదరాబాద్, వెలుగు: జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆయనకు జ్వరం రావడంతో హాస్పిటల్కు వెళ్లారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఎమ్మెల్యే హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు.