ధర్మసాగర్, వెలుగు: గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నట్టు ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక స్పష్టం చేశారు. గ్రామంలోని చేతిపంపులను తక్షణమే మరమ్మతులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. శనివారం గ్రామపంచాయతీ పాలకమండలి సమావేశం సర్పంచ్ రేణుక అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిలో భాగంగా చేతిపంపుల మరమ్మతులు, పంచాయతీ పాలకవర్గం శ్మశానవాటిక అభివృద్ధి, డ్రైనేజీ కాల్వల పైకప్పుల ఏర్పాటు వంటి తీర్మాణాలను ఆమోదించింది. ఈ తీర్మాణ పత్రాన్ని కార్యదర్శికి అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి గౌడ్, మండల పంచాయతీ అధికారి అబ్జల్, కార్యదర్శి ఆకార సురేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
