భద్రాచలం, వెలుగు: తేనె టీగల పెంపకంపై శిక్షణ తీసుకున్న గిరిజన యువతీ, యువకులు మార్కెట్ సౌకర్యం జీవనోపాధి కల్పించుకుని, ఆర్థికంగా ఎదగాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సూచించారు. వైటీసీలో ఐదు రోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి కిట్లను అందజేశారు. గిరిజనులు సేకరించే తేనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా శిక్షణ తీసుకున్న యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని తేనెను సేకరించాలన్నారు.
తేనె ఉత్పత్తి, వ్యాపారం చేసుకునే విధానం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించుకోవడం, వాట్సాప్, ఆన్లైన్ ద్వారా అమ్ముకునే విధానం, జాగ్రత్తలు, బాక్సులు ఎలా నిర్వహించాలని పీవో వారిని అడిగి తెలుసుకున్నారు.
