టీఆర్ఎస్​ ఒక్క ఎంపీ సీటూ గెల్వదు

టీఆర్ఎస్​ ఒక్క ఎంపీ సీటూ గెల్వదు

న్యూఢిల్లీ, వెలుగు: ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌‌ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేరని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని, ఉమ్మడి కార్యాచరణతో బీజేపీని ఓడించవచ్చని చెప్పారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా ఏకతాటిపైకి రావాలని కోరారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌‌ షాలను కలిశానని, త్వరలో జరగనున్న గ్లోబల్‌‌ ఎకనమిక్‌‌ సమ్మిట్‌‌ హైదరాబాద్‌‌లోనే నిర్వహించాలని కోరానన్నారు.