- సీఎన్ఎన్ సర్వేలో 14 పాయింట్ల లీడ్
- ట్రంప్కు 41%.. బిడెన్కు 55% ఓట్లు
- యూత్ను ఆకట్టుకోవడంలో మాత్రం వెనుకంజ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న డెమొక్రాటిక్ పార్టీ నామినీ జో బిడెన్.. తాజా సర్వేల్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కంటే ముందున్నారు. సీఎన్ఎన్ కోసం ఎస్ఎస్ఆర్ఎస్ జరిపిన సర్వేలో ట్రంప్ కంటే ఎక్కువ లీడ్లో ఉన్నారు. దేశవ్యాప్త సర్వేలో ట్రంప్కు 41 శాతం ఓట్లు వస్తే.. బిడెన్కు 55 శాతం ఓట్లతో మాంచి లీడ్లో ఉన్నారు. ట్రంప్ మద్దతుదారుల్లో ప్రతి పది మందిలో ఏడుగురు తిరిగి ట్రంప్ను రీఎలెక్ట్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే తాము ట్రంప్ కు మద్దతిస్తున్నాం కాబట్టీ ఆయనకే ఓటు వేస్తామని చెప్పారు. ఇక 27 శాతం మంది బిడెన్కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. బిడెన్ ఓటర్లలో 37 శాతం మంది మాత్రమే ప్రోబిడెన్ ప్లాన్కు ఓకే చెప్పారు. 60 శాతం మంది ట్రంప్కు వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. ఆదివారం రిలీజ్ చేసిన ఎన్బీసీ న్యూస్/వాల్స్ట్రీట్ జర్నల్ పోల్లో కూడా బిడెన్ ముందంజలో ఉన్నారు. బిడెన్కు 49 శాతం ఓట్లు వస్తే.. ట్రంప్కు 42 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. కానీ సీఎన్ఎన్ సర్వేలో బిడెన్ 50 శాతం మార్కును తాటారు. 2016 ఎన్నికల క్యాంపెయిన్ టైమ్లో ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ నేషనల్ పోల్స్ లో ఈ ఫీట్ సాధించలేకపోయారు. యూత్ను ఆకట్టుకోవడంలో బిడెన్ బాగా వెనుకబడ్డాడు. యువ ఓటర్లలో ఎగ్జయిట్మెంట్ తీసుకురావడంలో ఆయన ఫెయిల్ అవుతున్నారు. ఈ విషయంలో బిడెన్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.