నన్ను చూడటానికి ఎవరూ రావొద్దు: కేసీఆర్

నన్ను చూడటానికి ఎవరూ రావొద్దు: కేసీఆర్

తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ మధ్యకే వస్తానని.. అప్పటిదాకా సంయమనం పాటించి యశోద హాస్పిటల్ కు రావొద్దని కేసీఆర్ వేడుకున్నారు.

తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నందు వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను ఆయన కోరారు. ఇన్ఫెక్షన్ వస్తదని తనను డాక్టర్లు బయటకు పంపుతలేరని చెప్పారు.

తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ.. ఆయన చేతులు జోడించి వేడుకున్నారు. తనను చూడడానికి వచ్చి.. ప్రజలు ఇబ్బంది పడొద్దని… అదేవిధంగా హాస్పటల్ లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దని.. పదే పదే వీడియో ద్వారా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు.

  • Beta
Beta feature